Papua New Guinea: మోదీకి ఎదురెళ్లి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధానమంత్రి

ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నారు.

Papua New Guinea: మోదీకి ఎదురెళ్లి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధానమంత్రి

Updated On : May 21, 2023 / 7:29 PM IST

PM Modi: పాపువా న్యూ గినియా (Papua New Guinea) దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐ‭లాండ్స్ కూపరేషన్ (FIPIC) సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఆదివారం ఆ దేశం వెళ్లారు. ప్రధానమంత్రి మోదీని ఎయిర్‭పోర్టుకు వెళ్లి మరీ ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరపే (James Marape) స్వాగతం పలికారు. అయితే ఆ సందర్భంలోనే ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా మోదీకి పాదాభివందనం చేశారు జేమ్స్. మొదట ఇరు నేతలు కౌగిళించుకున్నారు. అనంతరం మోదీకి పాదాభివందనం చేశారు పాపువా న్యూ గినియా దేశ ప్రధాని.

Mumbai : బోరివాలి టూ అంథేరి.. డెయిలీ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న డాగ్

వాస్తవానికి సూర్యాస్తమయం తర్వాత తమ దేశాన్ని సందర్శించే ఏ నాయకుడికి పాపువా న్యూ గినియా సాధారణంగా ఉత్సవంగా స్వాగతం పలకదు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు. ఇక పాపువా న్యూ గినియా దేశాన్ని సందర్శించిన భారత మొదటి అధినేత మోదీయే. ఈరోజు వరకు జీ-7 సమ్మిట్ కోసం జపాన్‭లో ఉన్న మోదీ.. అది ముగించుకుని పాపువా న్యూ గినియాకు వెళ్లారు.

Bihar Politics: ఓట్లు అడిగిన ప్రజలనే నోట్లు అడుగుతున్న నేత.. వింత పద్దతిలో ఎన్నికల ప్రచారం

ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నారు. “ఈ ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశానికి (ఎఫ్‌ఐపిఐసి) హాజరు కావడానికి 14 పసిఫిక్ ద్వీప దేశాలు (పిఐసి) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆదివారం ఉదయం మోదీ ప్రకటన చేశారు.

Georgia Airline: జార్జియా దేశ అధ్యక్షురాలిని తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించిన జార్జియా ఎయిర్‭లైన్స్

ఎఫ్‌ఐపిఐసి సమ్మిట్‌లో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. 2014లో ప్రధాని మోదీ ఫిజీ పర్యటన సందర్భంగా దీన్ని ప్రారంభించారు. పసిఫిక్ దీవుల సహకారంలో కుక్ దీవులు, ఫిజీ, కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పాపువా న్యూ గినియా, సమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు, వనాటు ఉన్నాయి.