Sunita Williams: యాహూ.. ముగిసిన అన్డాకింగ్ ప్రక్రియ.. భూమి మీదకు వచ్చేస్తున్న సునీత విలియమ్స్
అన్డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్క్రాఫ్ట్ భూమి దిశగా బయలుదేరింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం కొనసాగుతోంది. ఐఎస్ఎస్ నుంచి స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వారిద్దరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు చేరుకున్నారు. ఈ స్పేస్క్రాఫ్ట్ ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి విడిపోయింది.
అన్డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్క్రాఫ్ట్ భూమి దిశగా బయలుదేరింది. బుధవారం తెల్లవారాజుమున భూ వాతావరణంలోకి అది ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ఇంజిన్ల ప్రజ్వలన చేపడతారు. అనంతరం తెల్లవారాజుమున 3.27 గంటలకు స్పేస్క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లోకి వస్తుంది. వ్యోమగాములను అక్కడి సహాయ బృందాలు బయటకు తీసుకువస్తాయి.
Also Read: సునీతా విలియమ్స్ స్ఫూర్తితో శాస్త్రవేత్త అవుతారా? ఇస్రోలో ఉద్యోగాలు ఇలా తెచ్చుకోవచ్చు?
అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక విడిపోయే ప్రక్రియ ముగియడంతో నాసా ప్రత్యక్ష ప్రసారం ఆపేసింది. ప్రస్తుతం ఆడియో ద్వారా మాత్రమే వివరాలు తెలుపుతోంది. బుధవారం తెల్లవారుజాము 2.15 గంటలకు మళ్లీ లైవ్ ప్రారంభం కావచ్చు.
ఈ ప్రక్రియలన్నీ జరిగే వరకు అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. 2024 జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇన్ని నెలలకు భూమి మీదకు వస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోనే సునీత విలియమ్స్ దీపావళి, థాంక్స్ గివింగ్ వంటి వేడుకలను జరుపుకున్నారు. డిసెంబర్లో ఐఎస్ఎస్ నుంచే విద్యార్థులతో ఆమె మాట్లాడారు. ఐఎస్ఎస్లో జ్యూస్ ఎలా తాగుతారో కూడా చూపారు.