భూమి నుంచి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో మరో గ్రహం.. అక్కడ జీవరాశి? ఆధారాలు గుర్తించిన భారతీయుడు.. ఎవరీ నిక్కు మధుసూదన్?

ప్రస్తుతం మధుసుధన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.

భూమి నుంచి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో మరో గ్రహం.. అక్కడ జీవరాశి? ఆధారాలు గుర్తించిన భారతీయుడు.. ఎవరీ నిక్కు మధుసూదన్?

Updated On : April 18, 2025 / 3:34 PM IST

గ్రహాంతర జీవులు ఉన్నాయా? భూమి మీదే కాకుండా ఇతర ఏదైనా గ్రహంలో జీవరాసి ఉంటుందా? అన్న ప్రశ్నలు మానవాళిలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి. గ్రహాంతర జీవులు ఉన్నాయని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, అందుకు తగ్గ కచ్చితమైన ఆధారాలను మాత్రం ఇవ్వలేకపోతున్నారు.

శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై జీవరాశి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా? అన్న విషయాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (James Webb Space Telescope – JWST) ద్వారా కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. జేడబ్ల్యూఎస్‌టీ అనేది నాసా, ఈసా (ESA – యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), సీఎస్ఏ (CSA – కెనడా స్పేస్ ఏజెన్సీ) కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక అంతరిక్ష టెలిస్కోప్.

భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ సారథ్యంలోని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల టీమ్‌ తాజాగా చేసిన ఓ పరిశోధనలో కీలక విషయాలు తెలిశాయి. కే2-18బీ అనే గ్రహం సూర్యుడి చుట్టూ కాకుండా మరో నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రహంపై జీవరాశి ఉండే అవకాశం ఉందనడానికి తాజాగా ఈ పరిశోధకులు ఆధారాలు గుర్తించారు.

ఆ గ్రహంపై జీవరాశికి సంబంధించిన డైమిథైల్ సల్ఫైడ్ (DMS), డైమిథైల్ డైసల్ఫైడ్ (DMDS) అనే వాయువులు వాతావరణంలో ఉన్నట్టు గుర్తించారు. ఇవి భూమ్మీద ప్రధానంగా సముద్ర జీవులు, బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసేవే. జీవానికి సంబంధించిన సంకేతాలు ఆ గ్రహంపై భారీ స్థాయిలో కనిపించడం ఆశ్చర్యకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Must Read: IPL 2025లో మ్యాచ్​ ఫిక్సింగ్? ప్లేయర్లకు హైదరాబాద్​ వ్యాపారవేత్త ఖరీదైన గిఫ్ట్​లు?

Also Read: హార్వర్డ్‌ వర్సిటీపై ట్రంప్‌కి ఎందుకింత కోపం? 10 పాయింట్లలో పూర్తి వివరాలు ఇదిగో..

దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సిన అవసరముంది. ఈ గ్రహం మీద జీవం ఉండే అవకాశముందని, త్వరలోనే ధ్రువీకరించగలమన్న నమ్మకం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కే2-18బీ అనే గ్రహం మన భూమి కన్నా రెండున్నర రెట్లు పెద్దది. భూమి నుంచి సుమారు 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఈ గ్రహం ఉంది. అంటే 120 కాంతి సంవత్సరాల దూరంగో ఈ గ్రహం ఉంటుంది.

కే2-18బీ గ్రహంలో జీవరాశి ఉండొచ్చని మధుసూదన్ సారథ్యంలోని కేంబ్రిడ్జి పరిశోధక బృందం గుర్తించినప్పటికీ, తమ పరిశోధన ఫలితాలు పూర్తిగా ధ్రువీకరించవచ్చని మాత్రం చెప్పలేమని అంది. కొత్తగా గుర్తించిన ఆధారాలను “ఆవిష్కరణ”గా పరిగణించడానికి ఆ ఫలితాలు 99.99% కంటే ఎక్కువ శాతం కచ్చితమైనవిగా ఉండాలి. మధుసూదన్ సారథ్యంలోని కేంబ్రిడ్జి పరిశోధక బృందం గుర్తించిన ఫలితాలు 99.7% కచ్చితత్వంతో ఉన్నాయి.

Must Read: DSC Notification: డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ సారి ఈ మార్పులు కూడా..

Also Read:  Vijayasai Reddy: రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ నిజమేనా?

నిక్కు మధుసూదర్ ఎవరు?
డాక్టర్ మధుసుధన్ 1980లో భారత్‌లో జన్మించారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యను వారణాసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని వారణాసిలో పూర్తి చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందారు.

ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ చేశారు. అక్కడే ప్లానెటరీ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎక్సోప్లానెట్ పరిశోధనలో డాక్టర్ సారా సీజర్ మార్గదర్శకత్వంలో పనిచేశారు.

ప్రస్తుతం మధుసుధన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఆయన సౌర వ్యవస్థ వెలుపల ఉండే గ్రహాలపై వాతావరణం, జీవరాశిపై పరిశోధనలు చేస్తున్నారు. “హైసియన్ గ్రహాలు” అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసినందుకు ఆయన చాలా గుర్తింపు వచ్చింది.