భాగ్యనగరంలో బొమ్మపడింది.. సినీ ప్రియుల్లో జోష్..

  • Published By: sekhar ,Published On : December 4, 2020 / 02:11 PM IST
భాగ్యనగరంలో బొమ్మపడింది.. సినీ ప్రియుల్లో జోష్..

Updated On : December 4, 2020 / 2:26 PM IST

Theatres re-opens: లాక్‌డౌన్ కారణంగా దాదాపు 8 నెలలపాటు థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. కరోనా భయం వల్ల చాలా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేయలేదు. కానీ ఈ రోజు (శుక్రవారం) నుంచి హైదరాబాద్‌లోని మహేష్ బాబు ‘ఏఎమ్‌బీ మాల్’, ప్రసాద్ మల్టీప్లెక్స్, పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ వంటివి రీ ఓపెన్ అయ్యాయి.


పూర్తి స్థాయి భద్రత, కరోనా ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ మల్టీప్లెక్స్‌ను నిర్వహించబోతున్నట్టు యాజమాన్యం ప్రకటించారు. ఓటీటీలు ఎన్ని థియేటర్లో మూవీ చూసిన ఎక్స్‌పీరియెన్సే వేరు.. అంటూ సినీ ప్రియులు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.


ఇన్ని రోజుల తర్వాత తమకు దేవాలయం వంటి థియేటర్లు పున:ప్రారంభం కావడంతో పనిచేసే సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. క్రిస్మస్ నుంచి కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.