Gaddar Film Awards: నా ఇన్టెన్షన్ అదికాదు.. అందుకే నేను అలా అన్నాను..: ఆ కామెంట్స్పై దిల్ రాజు క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు కూడా దిల్ రాజు స్పందించారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గద్దర్ అవార్డుల వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చూసుకున్న నిర్మాత దిల్ రాజును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రశంసించారు. అయితే, ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి చాలా మంది హాజరు కాలేదని ఇటీవల దిల్ రాజ్ బహిరంగంగానే కొంత ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దిల్ రాజు 10 టీవీ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించారు.
“2024కు సంబంధించిన గద్దర్ అవార్డ్స్ కి అందరూ వచ్చారు. మనం రాని దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతున్నాము. 2024 ప్రయారిటీ అవార్డ్స్.. దానికి అందరూ అటెండ్ అయ్యారు. 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు ఇచ్చిన అవార్డులకు చాలా మంది రాలేదు.. అది సెకండ్ ప్రయారిటీ. అంటే ఆ 10 ఇయర్స్ ఫిల్ చేయాలి కాబట్టి ప్రభుత్వం ఫిల్ చేసింది.
అందుకే దీనికి సెకండ్ ప్రయారిటీ. ఆ రోజు నేను చెప్పిన దాని వెనక ఉన్న నా ఇన్టెన్షన్.. వాళ్లు రాలేదు అని కాదు. అలాగే అక్కడ ఏపీలో కూడా ఫ్యూచర్ లో అవార్డ్స్ ఉంటాయి. కాబట్టి అవార్డ్స్ ఉన్నప్పుడు అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలతో ఫ్రెండ్లీ అంబియన్స్ లో ఉండాలి.
మనం వెళ్లి అవార్డ్ స్వీకరించడం ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇచ్చేది తీసుకోవాలి అనేది నా ఇన్టెన్షన్. అలాగే, ఏపీలో చర్చలకు చంద్రబాబు పిలిచారు. షూటింగులు ఉన్నాయని కొందరు రాలేరు అని అన్నారు. అది నాకు నచ్చలే.
సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మనం షూటింగ్ లను పక్కన పెట్టుకుని వెళ్లాలి. అంటే ప్రభుత్వంతో మనం ఫ్రెండ్లీ యాంబియన్స్ క్రియేట్ చేసి, అటెండ్ కావాల్సిన అవసరం మనకు ఉంది” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు కూడా దిల్ రాజు స్పందించారు. “తప్పకుండా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉంటాం కాబట్టి.. ఆ ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాం” అని అన్నారు. అక్కడ కూడా 2014 ఏడాది నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలకు నంది అవార్డులు ఇస్తారా? అన్న విషయం తమకు తెలియదని చెప్పారు. గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ని బట్టి ఉంటుందని తెలిపారు.