Guntur Kaaram Update : కేరళకు గుంటూరు కారం.. అప్ డేట్ ఇచ్చిన టీమ్

Guntur Kaaram Update : కేరళకు గుంటూరు కారం.. అప్ డేట్ ఇచ్చిన టీమ్

Guntur Kaaram Update

Guntur Kaaram Update : 2024 సంక్రాంతికి విడుదలవుతున్న ‘గుంటూరు కారం’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు మూవీ టీం అప్ డేట్ ఇచ్చింది. తాజాగా గుంటూరు కారం టీం కేరళకు వెళ్తోంది.

Ritika Singh : ఆ హీరోయిన్‌ చేతికి గాయాలు.. బ్రేక్ తీసుకుంటున్నా అంటూ పోస్టు

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ సంక్రాంతికి విడుదలవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నట్లు మూవీ మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఇక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతుండగా.. మరో రెండు పాటలు షూటింగ్ జరగాల్సి ఉంది. మహేష్-శ్రీలీలపై పాట చిత్రీకరణ కోసం మూవీ టీమ్ కొచ్చికి వెళ్లబోతోందట.

Sreeeleela : ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల మెరుపులు..

త్రివిక్రమ్ సినిమాల్లో డ్యూయెట్ సాంగ్స్ ఆల్ మోస్ట్ హిట్ అయ్యాయి. ఇక మహేష్-శ్రీలీలపై డ్యూయెట్ అంటే ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ బయటకు వచ్చి దుమ్ము రేపింది. జనవరి 12, 2024 థియేటర్లలో విడుదల కాబోతున్న గుంటూరు కారంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది.