Project K : ప్రాజెక్ట్ K ‘మిస్టరీ’ పై ప్రభాస్ ట్వీట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పఠాని, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
![Project K : ప్రాజెక్ట్ K ‘మిస్టరీ’ పై ప్రభాస్ ట్వీట్ Project K : ప్రాజెక్ట్ K ‘మిస్టరీ’ పై ప్రభాస్ ట్వీట్](https://10tv.in/wp-content/uploads/2023/07/Prabhas-Tweet-about-Project-K.jpg)
Prabhas Tweet about Project K
Prabhas Tweet about Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ahwin) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), దిశా పఠాని(Disha Patani), దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Haasan) లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్, ట్రైలర్ వంటి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ K అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఆ రోజు కోసం వెయిట్ చేయాలని చెబుతున్నారు హీరో ప్రభాస్. ‘ప్రాజెక్ట్ K అంటే ఏమిటి..? ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. దీనికి సమాధానం చెప్పేందుకు మేము సిద్దం అయ్యాం. అందుకు రెడీ ఉండండి. జూలై 20న యూఎస్లోని కామిక్ కాన్ సాన్ డియాగోలో అదెంటో తెలుసుకోండి.’ అని ట్వీట్ చేశాడు ప్రభాస్.
Comic Con : అసలు ‘కామిక్ కాన్’ ఏంటి? ప్రభాస్ ప్రాజెక్ట్ K ఎందుకు ‘కామిక్ కాన్’కి వెళ్తుంది?
#WhatisProjectK?! Get ready as we unveil the answer to this mystery that has captured the curiosity of millions across the world.
Join Team #ProjectK on July 20 at @Comic_Con, San Diego, USA.#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/pg1Z2ZDGzv
— Prabhas (@PrabhasRaju) July 13, 2023
వైజయంతి మూవీస్ బ్యానర్పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 12, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు పార్టులు రాబోతుందని ప్రకటించి ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. హోంబలే ఫిల్స్మ్ దాదాపు 200 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబులు విలన్లుగా కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.