Sri Simha : సుకుమార్‌తో తిట్లు తిన్న కీరవాణి కొడుకు.. ఎందుకో తెలుసా?

తాజాగా శ్రీసింహ ఓ ఇంటర్వ్యూలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Sri Simha : సుకుమార్‌తో తిట్లు తిన్న కీరవాణి కొడుకు.. ఎందుకో తెలుసా?

Keeravani Son Sri Simha Interesting Comments on Sukumar

Sri Simha : ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి(Keeravani) రెండో కొడుకు శ్రీసింహ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన శ్రీసింహ ‘మత్తు వదలరా’ సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ఉస్తాద్ సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు చేతిలో ఉన్నాయని సమాచారం. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శ్రీసింహ.

తాజాగా శ్రీసింహ ఓ ఇంటర్వ్యూలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. హీరో అవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్(Sukumar) దగ్గర పనిచేసినట్టు తెలిపాడు. శ్రీసింహ మాట్లాడుతూ.. నేను సరిగ్గా కాలేజికి వెళ్లకపోవడంతో ఇంట్లో వెళ్తే కాలేజీకి వెళ్ళు లేకపోతే ఏదో ఒక పని చెయ్యి అన్నారు. చిన్నప్పట్నుంచి సినిమాల ఫ్యామిలీ కావడంతో నాకు సినిమాలంటే ఇష్టం. నాన్న పేరు వాడకుండా ఏదో ఒకటి చేయాలని సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రై చేశాను. ఆయన ఓకే అన్నారు. రంగస్థలం సినిమాకు సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. జాయిన్ అయిన తర్వాత సుకుమార్ గారికి నేను కీరవాణి కొడుకు అని తెలిసింది. ఇక వర్క్ విషయంలో మాత్రం ఆయన చాలా స్ట్రిక్ట్. రెండు మూడు సార్లు తిట్టారు వర్క్ సరిగ్గా చేయకపోతే. అయినా ఆ తర్వాత వచ్చి సుకుమార్ గారే సారీ చెప్తారు. వర్క్ టెన్షన్ లో ఎవర్ని తిట్టినా ఆ తర్వాత వచ్చి మళ్ళీ సారీ చెప్తారు ఆయన అని తెలిపారు.

Also Read : Ramayanam : సైలెంట్‌గా రామాయణం మొదలుపెట్టేసిన బాలీవుడ్.. షూటింగ్ నుంచి రణబీర్, సాయి పల్లవి ఫొటోస్ లీక్..

అలాగే.. శ్రీసింహ భవిష్యత్తులో డైరెక్టర్ గా ఒక్క సినిమా అయినా చేస్తానని చెప్పాడు. మరి ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న శ్రీసింహ ఎప్పుడు దర్శకుడు అవుతాడో చూడాలి.