Shri Krishna Avatar in Mahoba : కృష్ణావ‌తారంపై సినిమా.. శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా..

ముకుంద్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా (Shri Krishna Avatar in Mahoba )అనే చిత్రం తెర‌కెక్కుతోంది.

Shri Krishna Avatar in Mahoba : కృష్ణావ‌తారంపై సినిమా.. శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా..

Mukund Pandey Shri Krishna Avatar in Mahoba title announce

Updated On : August 15, 2025 / 5:53 PM IST

Shri Krishna Avatar in Mahoba : ముకుంద్ పాండే (Mukund Pandey) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా (Shri Krishna Avatar in Mahoba) అనే చిత్రం తెర‌కెక్కుతోంది. అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ ల‌పై అనిల్ వ్యాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే సైతం ద‌ర్శ‌కుడు ముకుందు పాండేనే అందించారు.

11-12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించ‌నున్న‌ట్లుగా చెప్పారు.

Kishkindhapuri : ‘కిష్కింధపురి’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. బెల్లంకొండ‌, అనుప‌మ మామూలుగా భ‌య‌పెట్ట‌లేదుగా..

పాన్ వ‌ర‌ల్డ్ ప్రాజెక్టుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. ఈ చిత్రంలో న‌టించే నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు.