Pushpa 2 : పుష్ప 2 ఓటీటీ రిలీజ్ అధికారికంగా అనౌన్స్.. రీ లోడెడ్ కి ఇంకో 3 నిముషాలు యాడ్ చేసి.. మళ్ళీ చూడాల్సిందే..

పుష్ప 2 తమ ఓటీటీలోకి త్వరలో వస్తుందని రెండు రోజుల నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రమోట్ చేస్తుంది.

Pushpa 2 : పుష్ప 2 ఓటీటీ రిలీజ్ అధికారికంగా అనౌన్స్.. రీ లోడెడ్ కి ఇంకో 3 నిముషాలు యాడ్ చేసి.. మళ్ళీ చూడాల్సిందే..

Pushpa 2 Movie OTT Release Date Officially Announced by Movie Unit

Updated On : January 29, 2025 / 8:10 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇటీవల డిసెంబర్ 4న రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రిలీజయి 50 రోజులు దాటుతున్నా ఇంకా పలు థియేటర్స్ లో ఆడుతుంది. నార్త్ లో అయితే వీర లెవల్లో ఆడేస్తుంది పుష్ప 2 సినిమా. ఇటీవల జనవరి 17న రీ లోడెడ్ వర్షన్ అంటూ మరి కొన్ని సీన్స్ యాడ్ చేసి సినిమాని రిలీజ్ చేసారు. దీంతో మరోసారి థియేటర్స్ కి వెళ్లారు ఫ్యాన్స్.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది. పుష్ప 2 తమ ఓటీటీలోకి త్వరలో వస్తుందని రెండు రోజుల నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రమోట్ చేస్తుంది. తాజాగా పుష్ప 2 మూవీ యూనిట్ అధికారికంగా ఓటీటీ రిలీజ్ ప్రకటించింది. పుష్ప 2 సినిమా రేపు జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పుష్ప 2 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Chiranjeevi : తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. ఇంతకంటే ఏం కావలి అంటూ చిరంజీవి తల్లి ఎమోషనల్..

అయితే మూవీ యూనిట్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త కూడా చెప్పింది. ఇప్పటికే ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ లో 20 నిముషాలు జత చేసి రీ లోడెడ్ వర్షన్ అని రిలీజ్ చేయగా ఇప్పుడు ఓటీటీలో ఆ 20 నిమిషాలకు మరో మూడు నిముషాలు జతచేసి.. అంటే మొదట రిలీజ్ చేసిన సినిమాకు మొత్తం 23 నిమిషాల సీన్స్ కలిపి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆ మూడు నిముషాలు ఏంటి అని మళ్ళీ ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. రీ లోడెడ్ వర్షన్ చూడని వాళ్ళు ఓటీటీలో చూసేయండి.

Also Read : Divi : వామ్మో దివి ఇంత చదువుకుందా? ఇంట్లో అందరూ సెంట్రల్ గవర్నెమెంట్ ఉద్యోగులే.. సినిమాలు అంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మని..

ఇక పుష్ప 2 సినిమా ఇప్పటివరకు 1850 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని అధికారికంగానే ప్రకటించి బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిందని తెలిపారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 రోజులు దాటుతున్నా ఇంకా కలెక్షన్స్ పోస్టర్స్ వేయలేదు. ఫ్యాన్స్ అయితే 2000 కోట్ల కలెక్షన్స్ దాటేసింది, దంగల్ రికార్డులు కూడా బద్దలు కొట్టిందని అంటున్నా మూవీ యూనిట్ మాత్రం స్పందించలేదు. ఇటీవల పుష్ప 2 కలెక్షన్స్ వల్ల ఐటి అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, సుకుమార్ ఇల్లు, ఆఫీసులపై దాదాలు చేసిన సంగతి తెలిసిందే.