Sharwanand : దిల్ రాజు నాకు చెప్పలేదు.. శతమానం భవతి సీక్వెల్ పై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల దిల్ రాజు శతమానం భవతి సినిమా సీక్వెల్ ని ప్రకటించారు.

Sharwanand : దిల్ రాజు నాకు చెప్పలేదు.. శతమానం భవతి సీక్వెల్ పై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు..

Sharwanand Sensational Comments on Dil Raju Shatamanam Bhavati Sequel

Sharwanand : దిల్ రాజు నిర్మాణంలో 2017లో సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. సంక్రాంతి పండగ, ఓ కుటుంబం, బంధాలు, అనుబంధాలతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టడమే కాక నేషనల్ అవార్డు, నంది అవార్డులు కూడా దక్కించుకుంది.

ఇటీవల దిల్ రాజు శతమానం భవతి సినిమా సీక్వెల్ ని ప్రకటించారు. శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ ప్రకటించి వచ్చే సంవత్సరం 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా అనౌన్స్ చేసేసారు. అయితే శర్వానంద్ ఈ సీక్వెల్ లో నటించట్లేదని గతంలో రూమర్స్ వచ్చాయి. తాజాగా నేడు శర్వానంద్ నెక్స్ట్ సినిమా మనమే ట్రైలర్ లాంచ్ జరిగింది.

Also Read : Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది.. పిల్లల్ని పెంచడం అంటే ఈజీ కాదు..

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శర్వానంద్ ని శతమానం భవతి సీక్వెల్ గురించి దిల్ రాజు అనౌన్స్ చేసారు అని ప్రశ్నించగా.. దిల్ రాజు అనౌన్స్ చేసారా? ఆయన్నే అడగండి దాని గురించి, నాకు అయితే ఏం చెప్పలేదు అని అన్నారు. నవ్వుతూ సమాధానం ఇచ్చినా నిజంగానే శతమానం భవతి సీక్వెల్ సినిమాలో శర్వానంద్ హీరో కాదని తెలుస్తుంది. శతమానం భవతి సీక్వెల్ లో దిల్ రాజు తమ్ముడి కొడుకు, హీరో ఆశిష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి శర్వానంద్ ప్లేస్ లో దిల్ రాజు ఎవర్ని పెడతారో చూడాలి.