Pawan Kalyan : పవన్ కళ్యాణ్తో సురేందర్ రెడ్డి సినిమా అలా ఉంటుంది.. వక్కంతం వంశీ కామెంట్స్
పవన్ కళ్యాణ్తో సురేందర్ రెడ్డి సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేసిన దర్శకరచయిత వక్కంతం వంశీ.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత డైరెక్టర్ సురేంద్ర రెడ్డితో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. “యథా కాలమ్ తథా వ్యవహారమ్” అంటూ ఒక పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ తో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురు చూశారు. కానీ ఆ చిత్రం ఇప్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. అసలు ఈ మూవీ ఉందా లేదా అని సందేహం కూడా కలిగింది. కానీ ఇటీవల ఈ మూవీ వర్క్ మొదలైందని మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఈ సినిమా గురించి వక్కంతం వంశీ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీనే కథని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకుడిగా తెరకెక్కించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రమోషన్స్ లో.. పవన్ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలియజేశారు. ఇదొక సోషల్ సెటైర్ మూవీ అంటా. పవన్ కళ్యాణ్ ఈ కథ వినగానే ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళ్లామా అనిపించిన కథ అని అన్నారట. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ నుంచి అభిమానులు కూడా ఇలాంటి ఓ కథని కోరుకుంటున్నారు.
Also read : Yash 19 : యశ్ 19 టైటిల్ అనౌన్స్.. ‘టాక్సిక్’ అంటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..
SRT ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాని ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి. ప్రస్తుతం పవన్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. OG షూటింగ్ చివరి దశలో ఉంటే ఉస్తాద్ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఇక వీరమల్లు అప్పుడెప్పుడో సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకొని మిగతా సగం పూర్తి చేసుకోవడానికి కష్టాలు పడుతుంది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో ఈ సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది.