ట్రాఫిక్ జరిమానాల్లో బిగ్ రిలీఫ్ : గుజరాత్ బాటలో ఇతర రాష్ట్రాలు

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద

  • Published By: veegamteam ,Published On : September 12, 2019 / 05:16 AM IST
ట్రాఫిక్ జరిమానాల్లో బిగ్ రిలీఫ్ : గుజరాత్ బాటలో ఇతర రాష్ట్రాలు

Updated On : September 12, 2019 / 5:16 AM IST

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసిన వారికి విధించే జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా భారీగా జరిమానాలు వసూలు  చేస్తుండగా… గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ మాత్రం.. రాష్ట్రంలో జరిమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఏకంగా 90శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా వెయ్యి రూపాయలు కాగా దాన్ని రూ.500కు తగ్గించారు. సీటు బెల్టు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయిలు జరిమానా విధించాల్సి ఉండగా గుజరాత్‌ ప్రభుత్వం దాన్ని రూ. 500కు తగ్గించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే బైక్  లకు రూ.2 వేలు, ఇతర వాహనాలకు రూ.3 వేలు జరిమానా విధించనున్నారు. నూతన చట్టం కింద దేశంలోని ఇతర ప్రాంతాల్లో దీనికి రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. జరిమానాలను తగ్గిస్తూ గుజరాత్ సర్కార్  తీసుకున్న నిర్ణయం వాహనదారుల్లో ఆనందం నింపింది. ఇది మంచి నిర్ణయం అంటున్నారు.

గుజరాత్‌ తరహాలోనే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాలు తగ్గించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు జరిమానాలు తగ్గించుకోవచ్చని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఉత్తరాఖండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు కొంత రిలీఫ్ దక్కింది. 

ఇక చలాన్లను సగానికి తగ్గించాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. సీఎం యడియూరప్ప బుధవారం(సెప్టెంబర్ 11,2019) ఈ విషయమై రవాణాశాఖ అధికారులకు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో విధిస్తున్న జరిమానాల విధానాన్ని కర్నాటక అధికారులు అధ్యయనం చేశారు. రెండు రోజుల్లో సంపూర్ణ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆ తర్వాత జరిమానాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

గుజరాత్‌లో హెల్మెట్‌ ధరించకుంటే రూ. వెయ్యికి బదులు రూ.500, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుంటే రూ.500 జరిమానా వసూలు చేస్తున్నారు. ట్రిపుల్‌ రైడ్‌కు కేంద్రం వెయ్యి రూపాయిల జరిమానాను విధించగా గుజరాత్‌  ప్రభుత్వం రూ.100 వసూలు చేస్తోంది. ఇదే విధానాన్ని కర్నాటకలోనూ అమలు చేయాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. గుజరాత్‌లో మొదటి సారి సగమే విధించినా రెండోసారి అవే ఉల్లంఘనలకు పాల్పడితే  కేంద్రం విధించిన జరిమానాలను వసూలు చేస్తున్నారని కర్నాటక అధికారుల బృందం చేసిన సర్వేలో తెలింది. దీంతో కర్నాటకలో ఎలాంటి విధానం తీసుకురావాలన్న దానిపై పూర్తి నివేదిక వచ్చాక చర్చించి తగ్గింపు జరిమానాలను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బీహార్, గోవా, ఒడిశా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జరిమానాలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కొత్త మోటారు వాహనం చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చలానాలు రాస్తున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చి జరిమానాలను సగం వరకూ తగ్గించే పనిలో పడ్డాయి.