భారత్ చేరుకున్న మోడీ రెండో ప్రత్యేక విమానం

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2020 / 03:52 PM IST
భారత్ చేరుకున్న మోడీ రెండో ప్రత్యేక విమానం

Updated On : October 25, 2020 / 4:09 PM IST

Second Boeing 777 for PM, President to land today రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన రెండో ప్రత్యేక బోయింగ్​ 777 రెండో విమానం భారత్​ చేరింది. ఎయిర్​ ఇండియా వన్‌గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్​ అయింది. కాగా, తొలి ఎయిరిండియా వన్‌ విమానం.. ఈ నెల 1న టెక్సాస్ నుంచి ఢిల్లీకి చేరిన విషయం తెలిసింది.



జంబో విమానం బోయింగ్‌ బి-747ను బి-777గా మార్చి ఎయిరిండియా వన్‌ విమానాన్ని తయారుచేశారు. ఇందులో అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. గగనతలంలో ఎలాంటి ఆటంకాలు, హ్యాకింగ్‌ బెడద లేకుండా ఆడియో, వీడియా సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు.

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి ఈ విమానాలని భారత్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విమానంలో అధునాతన భద్రతా పరికరాలను అమర్చారు. వాస్తవానికి,ఈ రెండు విమానాలను ఈ ఏడాది జులైలోనే అందించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడినట్లు అధికారులు చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను వాయుసేనకు అప్పగించారు.



వీవీఐపీల ప్రయాణాల్లో ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్​ ఇండియా పైలట్లు కాకుండా వాయుసేన పైలట్లు నడుపుతారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు.. ఎయిర్​ ఇండియాకు చెందిన బీ747 విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వీటిని ఎయిర్​ ఇండియా పైలట్లు ఆపరేట్​ చేస్తున్నారు. బీ777 విమానాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బీ747లను ఎయిర్​ ఇండియాలో కమర్షియల్​ ఆపరేషన్స్​ కోసం వినియోగించనున్నారు.