Anand Mahindra: నీరజ్ను బాహుబలితో పోల్చిన ఆనంద్ మహీంద్రా.. ఇస్తోన్న గిఫ్ట్ ఇదే!
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. దేశంలో ఎవరు ఏది సాధించినా తనవంతుగా అభినందిస్తూ ఉంటారు.

Mahindra Group chairman Anand Mahindra.
Neeraj Chopra: మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. దేశంలో ఎవరు ఏది సాధించినా తనవంతుగా అభినందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుపించారు ఆనంద్ మహీంద్ర. విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన నిరజ్ చోప్రాను బాహుబలితో పోలుస్తూ.. మేమంతా నీ సైన్యం, బహుబలి అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. స్వర్ణం సాధించిన నీరజ్కు ఓ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మహీంద్ర.
We’re all in your army, Baahubali #NeerajChopra pic.twitter.com/63ToCpX6pn
— anand mahindra (@anandmahindra) August 7, 2021
అలాగే, ఒలింపిక్స్ గేమ్స్లో నిర్వహించే జావెలిన్ త్రో గేమ్ స్మారకార్థం విడుదల చేసే కాయిన్స్లో నీరజ్ చోప్రా ఫోటోను పెట్టి కొత్తగా విడుదల చెయ్యాలంటూ సూచిస్తూ మరో ట్వీట్ చేశారు మహీంద్ర. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
The Javelin throw is arguably the most frequently used image for commemorative coins. We need to have one officially released depicting #NeerajChopra @narendramodi @ianuragthakur pic.twitter.com/034m0ISTis
— anand mahindra (@anandmahindra) August 7, 2021
ఈ ట్వీట్లకు సంబంధించి ఓ నెటిజన్ నీరజ్కు XUV700 కారును గిఫ్ట్గా ఇవ్వాలని కోరగా.. నెటిజన్ ట్వీట్కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. అయ్యో.. తప్పకుండా.. మన గోల్డెన్ అథ్లెట్కు XUV700 గిఫ్ట్గా ఇవ్వడం నా అదృష్టం. నాకు కూడా గౌరవమే. అంటూ మహీంద్ర కంపెనీ ఎగ్జిక్యూటివ్లను ఆ పోస్ట్లో ట్యాగ్ చేస్తూ వెంటనే ఒక XUV700ని నీరజ్ చోప్రా కోసం సిద్ధం చెయ్యాలని ట్వీట్ చేశారు. దీంతో ఆనంద్ మహీంద్రపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
Yes indeed. It will be my personal privilege & honour to gift our Golden Athlete an XUV 7OO @rajesh664 @vijaynakra Keep one ready for him please. https://t.co/O544iM1KDf
— anand mahindra (@anandmahindra) August 7, 2021