సరిహద్దుల్లో అలజడి : మరో ఆర్మీ ఆఫీసర్ మృతి

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 12:37 PM IST
సరిహద్దుల్లో అలజడి : మరో ఆర్మీ ఆఫీసర్ మృతి

Updated On : February 16, 2019 / 12:37 PM IST

ఉగ్రవాదుల దాడిలో 44 మంది జవాన్లు మృతి చెందిన ఘటన మరవకముందే.. భారత్ – పాక్ సరిహద్దుల్లో మరో ఘోరం. లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC)కి ఒకటిన్నర కిలోమీటర్ల భారత భూభాగం లోపల తీవ్రవాదులు బాంబులు అమర్చారు. వాటిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో.. ఓ ఆర్మీ ఆఫీసర్ చనిపోయాడు. ఇదే సమయంలో సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. కాల్పులకు కూడా తెగబడ్డారు.

ఓ వైపు బాంబులు నిర్వీర్యం చేస్తూనే.. మరోవైపు ఉగ్రవాదులతో పోరాటానికి దిగారు మన జవాన్లు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకాశ్మీర్ రాజౌరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాక్ రేంజర్లు పదేపదే కాల్పులకు దిగటం అదనపు బలగాలను మోహరించింది ఆర్మీ.