బడ్జెట్ 2020లో రైతుల కోసం కొత్త పథకాలు ఇవే!

బడ్జెట్ 2020కి మోడీ సర్కార్ రెడీ అయింది. మరికొన్ని గంటల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్ లో చదవి వినిపించనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే శనివారం(ఫిబ్రవరి-1,2020)పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2020లో రైతలు రెండు కీలక పథకాలను ప్రకటించే అవకాశముంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకాల విషయానికి వస్తే.. వీటిల్లో ఒకటి కార్ప్ డైవర్సిఫికేషన్ (భిన్నమైన పంటలు)కు సంబంధించిన స్కీమ్, మరొకటి ఎఫ్పీవో ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించే పథకం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీవో) ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీవో కార్యక్రమానికి రూ.7,000 కోట్లు కేటాయించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. దీని వల్ల 10 వేల వరకు ఎఫ్పీవోల ఏర్పాటు సాధ్యం కావొచ్చు. ఎఫ్పీవోల్లోని చిన్న, సన్నకారు రైతుల గ్రూప్లు రైతుల ఆదాయం పెరగుదలకు సాయం అందిస్తారు. మార్కెట్ యాక్సెస్ మరియు సామూహిక బేరసారాల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోడానికి ఎఫ్పిఓలు సహాయం చేస్తాయి. ఎఫ్పీవోలు బిజినెస్ యూనిట్లుగా పనిచేస్తాయి. వీటికి వచ్చే లాభాలు.. ఆ గ్రూప్లోని సభ్యులే తీసుకుంటారు. వ్యవసాయ మంత్రత్వి శాఖ ఎఫ్పీవోలకు నిధులకు సమకూరుస్తుంది. అలాగే ఏమైనా టెక్నాలజీ పరమైన అవసరాలు ఉంటే.. వాటికి కూడా తీరుస్తుంది.
మరొకటి కార్ప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా రేప్ బడ్జెట్ సందర్భంగా కేంద్రం లాంచ్ చేయొచ్చు. దీని కోసం రూ.500 నుంచి రూ.600 కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. నేలను సారవంతంగా మార్చడం, వ్యవసాయ-పర్యావరణ సమతుల్యత అనే అంశాలు ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా ఉండనున్నాయి. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తీసుకురావొచ్చు.