Covid sub-variant JN.1 : దేశంలో 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి
దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు....

Covid sub-variant JN.1
Covid sub-variant JN.1 : దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదు అయ్యాయి.
ALSO READ : వైసీపీ అభ్యర్థుల ధర్డ్ లిస్ట్.. జిల్లాల వారీగా మార్పులు చేర్పులు ఇవే
దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా 214 కేసులు నమోదయ్యాయని ఇండియన్ సార్స్ కొవిడ్ -2 జెనోమిక్స్ కన్సార్టియం డేటా వెల్లడించింది. మహారాష్ట్రలో 170 కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. కేరళలో 154 కేసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 105, గుజరాత్ రాష్ట్రంలో 76, గోవాలో 66 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ALSO READ : Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్బంప్స్ గ్యారెంటీ..
తెలంగాణ, రాజస్థాన్లలో 32 జేఎన్ 1 కేసులు, ఛత్తీస్గఢ్లో 25, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, హర్యానాలో 5, ఒడిశాలో 3, పశ్చిమ బెంగాల్లో 2, ఉత్తరాఖండ్లో ఒక కేసు వెలుగుచూసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జేఎన్1 ఉప-వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంటి ఆధారిత చికిత్సను ఎంచుకుంటున్నందున తక్షణం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెప్పారు.
ALSO READ : వైసీపీ అలర్ట్.. రంగంలోకి కీలక నేతలు, ముద్రగడ పద్మనాభంకు బుజ్జగింపులు
కొవిడ్ కొత్త వేరియంట్ నివారణకు కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరుగుతున్నా, ఈ వైరస్ తక్కువ ప్రజారోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కొవిడ్ వైరస్ జేఎన్ 1 సబ్ వేరియంట్ గతంలో ప్రబలిన బీఏ 2.86 వేరియంట్ గా వర్గీకరించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.