Polluted Cities : దేశంలో దీపావళి తర్వాత కాలుష్య నగరాలివే…
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్యం మరింత పెరిగిందని తాజాగా వెల్లడైంది.....
Polluted Cities : దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్యం మరింత పెరిగిందని తాజాగా వెల్లడైంది. దీపావళి తర్వాత వాయు కాలుష్య స్థాయి పెరగడంతో రాజధాని నగరమైన ఢిల్లీ పొగమంచుతో, యమునా నది విషపు నురుగుతో తేలుతోంది.
నగరాల్లో కొరవడుతున్న గాలి నాణ్యత
ఈ పటాసుల పేలుళ్ల నుంచి వెలువడిన ఉద్గారాలు, పొగ వివిధ రాష్ట్రాల్లో కాలుష్య స్థాయిని పెంచింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయితో సహా భారతదేశం అంతటా ప్రధాన నగరాలు కాలుష్య సమస్యతో అల్లాడుతున్నాయి. గత కొన్ని వారాల్లో వివిధ నగరాల్లో వాయు కాలుష్యం పెరిగింది. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, వ్యవసాయ వ్యర్థాల దహనం, బాణసంచా కాల్చడం వల్ల మంగళవారం ఉదయం 6.30 గంటలకు గాలి నాణ్యత టాప్ టెన్ నగరాల్లో గణనీయంగా తగ్గింది.
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీతో పాటు హర్యానా రాష్ట్రంలోని రెండు నగరాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు నగరాలు, పంజాబ్ లో ఒక నగరం, రాజస్థాన్ రాష్ట్రంలో ఒక నగరంలో వాయు కాలుష్యం పెరిగిందని తాజా వాయు కాలుష్య గణాంకాలు చెబుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఢిల్లీలో వాహనాల పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేశారు. నవంబర్ 13వతేదీన 242 నగరాల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఏ నగరంలో కూడా గాలి నాణ్యత సరిగా లేదు.
ALSO READ : Rishi Sunak : యూకే ప్రధానమంత్రి రిషి సునక్ పై ఎంపీ అవిశ్వాస లేఖ
53 నగరాల్లో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని తేలింది. 85 నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత, 75 నగరాల్లో మితమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి. దేశంలోని 242 నగరాల్లో కేవలం 32 నగరాల్లో మాత్రమే సంతృప్తికరమైన గాలి నాణ్యత నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్ నగరంలో మంగళవారం గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 423గా నమోదైంది. హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ఏక్యూఐ 400 ఉంది. ఢిల్లీ, యూపీలోని మీరట్, నోయిడా నగరాల్లోనూ కాలుష్యం కమ్ముకుంది.
ALSO READ : Virat Kohli : నా కూతురు వామిక ఫొటోలు తీయొద్దు.. ఫొటోగ్రాఫర్లకు విరాట్ కోహ్లీ ప్రత్యేక అభ్యర్థన
పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నగరంలో ఏక్యూఐ 374,రాజస్థాన్లోని భరత్పూర్ నగరంలో ఏక్యూఐ 371, బీహార్లోని బెగసరాయ్ నగరంలో ఏక్యూఐ 367, బీహార్లోని ఛప్రాలో ఏక్యూఐ 366, హర్యానాలోని రోహ్తక్ నగరంలో ఏక్యూఐ 365గా నమోదైంది. రాజస్థాన్లోని హనుమాన్గఢ్,రాజస్థాన్లోని భివాడి,హర్యానాలోని ధరుహెరా,ఘజియాబాద్,బీహార్లో సివాన్, హిసార్, ఒడిశాలోని అంగుల్,హర్యానాలోని బల్లాబ్గఢ్,బీహార్లోని పూర్నియా,హర్యానాలోని మనేసర్ నగరాల్లో వాయు కాలుష్యం పెరగడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
VIDEO | "Yesterday, the AQI in parts of Delhi was recorded between 215 and 220. And today, it reached 315-320 after firecrackers were burst in a targeted manner in several areas of Delhi, UP, and Haryana," says Delhi minister @AapKaGopalRai after the pollution review meeting in… pic.twitter.com/RyjaKVV2Ch
— Press Trust of India (@PTI_News) November 13, 2023