Dayanidhi Maran: హిందీ మాట్లాడేవారు టాయిలెట్లు కడుగుతారు.. దుర్మార్గ వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత
డీఎంకే ఎంపీ దయానిధి మారన్పై బీహార్, యూపీకి చెందిన ఇండియా అలయన్స్ నేతలు మాట్లాడలేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లిష్ నేర్చుకుని ఇక్కడికి వచ్చేవారు ఐటీ కంపెనీల్లో మంచి జీతాలతో పనిచేస్తున్నారని దయానిధి ఆ వీడియోలో చెప్పడం చూడొచ్చు
హిందీ మాట్లాడే వారిపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలంటూ డీఎంకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వివాదం ముగియకముందే దయానిది రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి హిందీ ప్రజలు తమిళనాడుకు వచ్చి ఇక్కడ నిర్మాణ, రోడ్డు పని కార్మికులుగా లేదా మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులుగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. డీఎంకే ఎంపీ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యతో కూడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్పై బీహార్, యూపీకి చెందిన ఇండియా అలయన్స్ నేతలు మాట్లాడలేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లిష్ నేర్చుకుని ఇక్కడికి వచ్చేవారు ఐటీ కంపెనీల్లో మంచి జీతాలతో పనిచేస్తున్నారని దయానిధి ఆ వీడియోలో చెప్పడం చూడొచ్చు. యూపీ-బీహార్ నుంచి హిందీ మాట్లాడే ప్రజలు ఇక్కడకు వచ్చినప్పుడు, వారు తమిళం నేర్చుకుని భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తారని, రోడ్లు పని టాయిలెట్లు శుభ్రం చేసే పని చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
The I.N.D.I Alliance is supposedly a “mohabbat ki dukaan” persona presented and sold to the people of India by @RahulGandhi ji and his alliance but the reality of this Mohabbat is creating regionalism divide, making one state fight against another
DMK leader Dayanidhi Maran… pic.twitter.com/joV5BxqEin
— Satya Kumar Y (సత్యకుమార్ యాదవ్) (@satyakumar_y) December 24, 2023
దయానిధి మారన్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, బీహార్ల ఇండియా కూటమి మౌనంపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ‘‘నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండియా కూటమి నాయకులందరూ ఏమీ జరగనట్లు వ్యవహరిస్తారా? ఈ వ్యక్తులు తమ వైఖరిని ఎప్పుడు తీసుకుంటారు? డీఎంకే కూడా ఇండియా కూటమిలో భాగం’’ అని బీజేపీ నేత షేజాద్ పూనావాలా విమర్శించారు.