Covid-19: కరోనా రోగులకు వరంగా మారిన పరికరం ఇదే!

కరోనా వచ్చిన వారు ఆసుపత్రిపాలు కాకుండా ఉండాలి అంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని ఆక్సిజన్ మోతాదును పల్స్ అక్షీమీటర్ తో గుర్తించవచ్చు.. కానీ ఒకేసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లక తప్పని పరిస్థితి.

Covid-19: కరోనా రోగులకు వరంగా మారిన పరికరం ఇదే!

Covid 19 (5)

Updated On : April 20, 2021 / 10:45 AM IST

Covid-19: కరోనా వచ్చిన వారు ఆసుపత్రిపాలు కాకుండా ఉండాలి అంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని ఆక్సిజన్ మోతాదును పల్స్ అక్షీమీటర్ తో గుర్తించవచ్చు.. కానీ ఒకేసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లక తప్పని పరిస్థితి.

అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఆ సమస్యకు పరిస్కారం దొరకనుంది. దేశ సరిహద్దుల్లో ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో ఓ పరికరం తయారు చేసింది. ఇది కరోనా బాధితులకు వరంలా మారనుంది. ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ లెవల్స్ ను గుర్తించి తక్కువ ఉంటే తగిన మోతాదులో అందిస్తుంది.

ఆక్సిజన్ సిలిండర్ కు అనుసంధానంగా ఉండే ఈ పరికరం కరోనా రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. కాగా ఈ పరికరాన్ని బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ‘ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ’ తయారుచేసింది. దీనికి ‘ఎస్‌పీవో–2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం’ పేరుపెట్టారు.

ఈ పరికరానికి ఒక లీటర్‌ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్‌ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్‌డీవో ఓ ప్రకటనలో తెలిపింది.