Mumbai : రూ.116 కోట్ల ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన ఫ్యాషన్ డిజైనర్..

ముంబయికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ రూ.116 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఎవరా ఫ్యాషన్ డిజైనర్ ?

Mumbai : రూ.116 కోట్ల ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన ఫ్యాషన్ డిజైనర్..

Mumbai

Mumbai : ముంబయిలో రూ.115 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి వ్రాతిక గుప్తా అనే మహిళ వార్తల్లో నిలిచారు. అసలు ఎవరీ వ్రాతిక గుప్తా?

Haryana : వృద్ధుడికి తిరిగి ప్రాణం పోసిన గుంత.. ఈ వింత ఎక్కడ జరిగిందంటే?

ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం ద్వారా ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్, మైసన్ సియా  లగ్జరీ హోమ్ డెకార్ కంపెనీ ఫౌండర్ వ్రాతిక గుప్తా వార్తల్లో నిలిచారు. ‘త్రీ సిక్ట్సీ వెస్ట్’ హై-రైజ్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.116.42 కోట్లకు కొనుగోలు చేసారామె.  12,138 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న అపార్ట్‌మెంట్‌లో .. ఎనిమిది వరకు కార్లు పార్క్ చేసుకునే అవకాశం ఉంది. జనవని 7, 2024 న రిజస్ట్రేషన్ జరిగినట్లు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి.

Gangster Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం…ఢిల్లీ లాయర్ కొనుగోలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో (NIFT), పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్‌లో పూర్వ విద్యార్ధిని అయిన వ్రాతిక గుప్తా ఫ్యాషన్స్ లిమిటెడ్ అపెరల్ డిజైనర్‌గా ఫ్యాషన్ వరల్డ్‌లో తన కెరియర్‌ను ప్రారంభించారు. 2009 నుండి 2011 వరకు అంజు మోడీకి డిజైనర్‌గా సహకరించారు. కాగా ఈ అపార్ట్‌మెంట్ కొనుగోలు విషయంపై  స్పందించేందుకు గుప్తా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆమె నకుల్ అగర్వాల్‌ను పెళ్లాడారు. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీ జరపడం ద్వారా వ్రాతిక గుప్తా వార్తల్లో నిలిచారు.