వాలంటీర్ గా “కోవాగ్జిన్” ట్రయిల్ టీకా వేయించుకున్న మంత్రి
Haryana Health Minister కరోనా వైరస్ ని అంతమొందించేందుకు భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్ టీకా”ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. కాగా, ఇవాళ(నవంబర్-20,2020)’కొవాగ్జిన్’ మూడో దశ ప్రయోగాలు హర్యాణాలో ప్రారంభమయ్యాయి.
ఈ టీకా కోసం హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్.. వాలంటీర్గా మారారు. మూడో దశ ప్రయోగాలకు సంబంధించి తొలి టీకాను ఆయనే వేయించుకున్నారు. అంబాలాలోని కాంట్ సివిల్ హాస్పిటల్ లో పీజీఐ రోహ్తక్ వైద్యుల బృందం సమక్షంలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో చేస్తోన్న ఈ ప్రయోగ పరీక్షల్లో 26 వేల మంది వాలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమైనట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది.
https://10tv.in/kerala-corona-participating-in-kollam-municipal-election/
భారత వైద్య పరిశోధన మండలిశ(ఐసీఎంఆర్) సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ కోసం దేశంలో భారత్ బయోటెక్ చేపడుతోన్న అతిపెద్ద క్లినికల్ పరీక్ష ఇదే కావడం విశేషం. కాగా, మూడో దశ ప్రయోగాలు విజయవంతమైతే అతి త్వరలోనే టీకాను ప్రజలకు అందుబాటులోకి రానుంది.
#WATCH Haryana Health Minister Anil Vij being administered a trial dose of #Covaxin, at a hospital in Ambala.
He had offered to be the first volunteer for the third phase trial of Covaxin, which started in the state today. pic.twitter.com/xKuXWLeFAB
— ANI (@ANI) November 20, 2020