Bihar : కూతురుని ఇన్స్టా రీల్స్ చేయద్దన్నాడని అల్లుడిని చంపిన అత్తమామలు
Bihar : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కుమార్తెను రీల్స్ చేయనివ్వకుండా అల్లుడు అభ్యంతరం చెప్పాడని అత్తమామలు అతని ప్రాణాలు తీసారు. సంచలనం రేపుతున్న ఈ ఘటన బీహార్లో జరిగింది.
బీహార్లోని బెగుసరాయ్కి చెందిన మహేశ్వర్ కుమార్ రాయ్కు ఆరేళ్ల క్రితం రాణి కుమారితో పెళ్లైంది. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. మహేశ్వర్ కుమార్ కోల్కతాలో కూలిపని చేస్తుంటాడు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య రాణి కుమారి తరచూ ఇన్స్టాగ్రామ్లో పాటలకు రీల్స్ చేస్తుంటుంది. అది నచ్చని మహేశ్వర్ భార్యకు వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
Lee Sun Kyun : డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ‘పారాసైట్’ మూవీ నటుడు ఆత్మహత్య
ఈ నేపథ్యంలోనే మహేశ్వర్ అత్తమామల ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అతని సోదరుడు రుడాల్ మహేశ్వర్కి ఫోన్ చేసాడు. ఫోన్ వేరే వ్యక్తులు తీసి మహేశ్వర్ ఉరి వేసుకుని చనిపోయినట్లు చెప్పారు. అనుమానంతో రుడాల్ కుటుంబసభ్యులతో మహేశ్వర్ అత్తమామల ఇంటికి వెళ్లేసరికి మహేశ్వర్ డెడ్ బాడీ కనిపించింది. అతని అత్తమామలు ఇంటి నుండి పరారయ్యారు. మహేశ్వర్ అత్తమామలే అతడిని చంపి పడేసి పారిపోయారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.