సహజీవనం చేసేందుకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా?

దీని ప్రకారం ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండకూడదు.

సహజీవనం చేసేందుకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా?

New Rules For Live In Relationship

Updated On : February 7, 2024 / 11:19 AM IST

Live In Relationship Rules :  యూనిఫామ్ సివిల్ కోడ్ ను(UCC) అమలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది ఉత్తరాఖండ్. దీంతో ఆ రాష్ట్రంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రకారం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో(సహజీవనం) ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటూ ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే శిక్ష విధించనుంది. ఉత్తరాఖండ్ లోని ప్రతిపాదిత యూసీసీ ప్రకారం.. వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఒక నెల కంటే ఎక్కువ కాలం సహజీనంలో ఉంటే వారికి శిక్ష విధించబడుతుంది. మూడు నెలల వరకు జైలుకు శిక్షతోపాటు రూ. 10,000 జరిమానా ఉంటుంది. అంతేకాక, రెండూ విధించబడతాయి.

ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే..
లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్న జంట నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యం కూడా పొందగలుగుతారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదాలో ఇటువంటి అంశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. యుసీసీలో లివ్ ఇన్ రిలేషన్‌పై స్పష్టమైన వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం ఒక పురుషుడు- ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు. చట్ట ప్రకారం మరే ఇతర నిషేధిత సంబంధాల్లో ఉండకూడదు.

ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్
లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ప్రతీ వ్యక్తి ప్రభుత్వ రిజిస్ట్రర్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదు కూడా అందజేస్తారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ కోసం రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రర్ చేయించుకున్న జంట.. ఆ విషయాన్ని తమ పేరెంట్స్ కు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read: సామాన్యులకు పండుగే.. రూ. 29కే కిలో భారత్ రైస్.. త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..!