నూతన CJIగా నియమితులైన జస్టిస్ బోబ్డే

నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ అక్టోబర్ 3, 2018న బాధ్యతలు చేపట్టగా, నవంబర్ 17, 2019న రిటైర్డ్ కానున్న విషయం తెలిసింది. తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు గొగయ్ ఇటీవల లేఖ రాశారు.
కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలి సిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్ గొగోయ్ తర్వాత శరద్ అరవింద్ సీనియర్గా ఉన్నారు.ఈ సమయంలో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమించబడ్డారు. 2021 ఏప్రిల్ లో బోబ్డే రిటైర్డ్ కానున్నారు. 18నెలల పాటు సీజేఐగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.
1956,ఏప్రిల్ 24,1956లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జన్మించిన ఎస్ ఏ బోబ్డే 2000సంవత్సంలో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా చేరారు.2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013ఏప్రిల్ లో ఆయన సుప్రీంకోర్టుకి బదిలీ అయ్యారు. అయోధ్య భూ వివాదం,బీసీసీఐ,ఫైర్ క్రాకర్స్ కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ల వంటి పలు ముఖ్య కేసుల్లో ఆయన విచారణ చేపట్టినవారిలో ఉన్నారు.