Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు..

మధ్యాహ్నమే విజయ్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల విజయ్ లేటుగా వచ్చారు.

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు..

Updated On : September 27, 2025 / 11:29 PM IST

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. రేపు ఉదయం సీఎం స్టాలిన్ కరూర్ కు వెళ్లనున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. తిరుచ్చి, దిండిగల్ కలెక్టర్లను కరూర్ వెళ్లాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ మంత్రి, పాఠశాల విద్యాశాఖ మంత్రిని ఘటనా స్థలానికి వెళ్లాలన్నారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అని ఆయన వాపోయారు.

కరూర్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. 36 మంది చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 8మంది చిన్నారులు ఉన్నారు. 16 మంది మహిళలు ఉన్నారు. బాధితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్ ర్యాలీకి 10వేల మది వస్తారని టీవీకే నేతలు అంచనా వేశారు. అయితే, ఊహించని విధంగా ర్యాలీకి 50వేల మందికిపైగా జనం వచ్చినట్లు సమాచారం. పరిమితికి మించి జనం రావడంతో తొక్కిసలాట ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

కరూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో మహిళలు ఎక్కువగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంచనాలకు మించి అభిమానులు, జనం వేల సంఖ్యలో ర్యాలీకి తరలివచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది.

శనివారం మధ్యాహ్నమే విజయ్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల విజయ్ లేటుగా వచ్చారు. జనాలు మరింతగా పోగయ్యే వరకు విజయ్ రాలేదు. కరూర్ లో చాలా ఇరుకైన ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఇలా అనేక కారణాలతో ఈ దుర్ఘటన జరిగింది. విజయ్ సభా వేదిక పై నిల్చుని ప్రసంగిస్తూ ఉండగానే.. క్రమంగా తొక్కిసలాట మొదలైంది. ఈ దుర్ఘటనతో విజయ్ సైతం షాక్ కి గురయ్యారు. బాధితులను కాపాడాలని పోలీసులను, డాక్టర్లను ప్రాధేయపడ్డారు. కొంతమందికి ఆయనే నీళ్లు అందించే ప్రయత్నం కూడా చేశారు.

పార్టీ ప్రకటించిన తర్వాత విజయ్ తమిళనాడు రాష్ట్రం మొత్తం మీటింగ్ లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇటీవలే మూడు నాలుగు చోట్ల మీటింగ్స్ పెట్టారు. ఇవాళ కరూర్ లో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ కు అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే చాలా ఇరుకైన ప్రాంతంలో భారీ బహిరంగ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సుమారు 50వేల మంది మీటింగ్ కు హాజరయ్యారని భావిస్తున్నారు.