ATGM క్షిపణి ప్రయోగం విజయవంతం
దేశీయంగా రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్(ATGM)ను విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO). మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ లోని ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్, స్కూల్(ఏసీసీఎస్)లోని కేకే రేంజ్ నుంచి ఎంబీటీ అర్జున్ ట్యాంక్ ద్వారా ఈ క్షిపణిని ప్రయోగించగా.. 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఏటీజీఎం విజయవంతంగా ఛేదించినట్లు డీఆర్డీఓ తెలిపింది.
పూణేలోని ఆయుధ పరిశోధన మరియు డెవలప్మెంట్ ఎస్టాబ్లిషమెంట్ (ARDE) పూణే…. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్ఇఎంఆర్ఎల్), మరియు ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఐఆర్డిఇ) డెహ్రాడూన్ తో కలిసి ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి.
ఏటీజీఎం క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన DRDOకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అభినందనలు తెలిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భవిష్యత్తులో రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కృషి చేస్తున్న డీఆర్డీఓ బృందం పట్ల భారత్ గర్వపడుతోందన్నారు.
ఈఆర్ఏ(ఎక్స్ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్) రక్షిత సాయుధ వాహనాలను పేల్చేందుకు ఈ క్షిపణి భారీగా ఉష్ణాన్ని ఉత్పన్నం చేస్తుందని డీఆర్డీఓ తెలిపింది. దీనిని వేరువేరు ప్లాట్ఫాంల నుంచి ప్రయోగించేందుకు వీలుగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.