Earthquake : జమ్మూకశ్మీరులో మళ్లీ భూకంపం…వరుస భూకంపాలతో భయాందోళనలు

Earthquake : జమ్మూకశ్మీరులో మళ్లీ భూకంపం…వరుస భూకంపాలతో భయాందోళనలు

Earthquake

Earthquake : దేశంలోని జమ్మూకశ్మీరులో శనివారం మళ్లీ భూకంపం సంభవించింది. దేశంలో జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జమ్మూకశ్మీరులోని గుల్ మార్గ్ వద్ద శనివారం ఉదయం 8.36 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. (National Center for Seismology)

HIV positive : యూపీ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ…విచారణకు ఆదేశం

గుల్ మార్గ్ కు 184 కిలోమీటర్ల దూరంలో 129 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. (Earthquake) జమ్మూకశ్మీరులో ఈ ఏడాది ఇప్పటివరకు 12 సార్లు భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ( Earthquake jolts Jammu and Kashmir) గతంలో దోడ జిల్లాలో జులై 10వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9 గా నమోదైంది.

MS Dhoni’s Daughter Ziva : ధోని కుమార్తె జీవా ఏ స్కూల్‌లో చదువుతుందంటే…ఆ స్కూలు ఫీజు తెలిస్తే షాక్ అవుతారు

దోడ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇటీవల వరుసగా వారం రోజులపాటు అండమాన్ నికోబార్ దీవులను భూకంపాలు వణికించాయి. ఈ భూకంపాల వల్ల పెద్దగా ఆస్తి నష్టం జరగకున్నా, తరచూ జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపాలతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.