బస్సులో చార్జింగ్ పోర్ట్ లేదు.. ఏసీ వెయ్యలేదు: ఆర్టీసీకి ఫైన్ వేసిన వినియోగదారుల హక్కుల ఫోరమ్

యాడ్స్లో చూపిన విధంగా బస్సులో ఎయిర్కండిషనింగ్, మొబైల్ చార్జింగ్ పాయింట్లేకపోవడంతో పాసింజర్కు రూ.5 వేల ఫైన్ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఆదేశించింది వినియోగదారుల హక్కుల ఫోరమ్. వివరాల్లోకి వెళ్తే సతీష్రతన్లాల్ అనే వ్యక్తి దయామా తన ఫ్రెండ్తో కలిసి శివ్షాహి బస్లో జల్నా నుంచి ఔరంగాబాద్కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్ పాయింట్ కోసం అడిగాడు.
అయితే బస్సులో ఏసీ, చార్జింగ్ పాయింట్ పని చేయడం లేదని సదరు బస్సు నిర్వాహకులు చెప్పారు. దీంతో కంప్లయింట్ రిజిస్టర్ను ఇవ్వాలని బస్ డ్రైవర్, కండక్టర్ను అడిగితే ఇవ్వలేదు. దీంతో జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరమ్లో కంప్లయింట్ చేశాడు సతీష్రతన్లాల్ దయామా.
ఏసీ, చార్జింగ్ పాయింట్ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్ టెన్షన్ అనుభవించానంటూ ఫిర్యాదులో వెల్లగించాడు సతీష్రతన్లాల్. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్లో ఏసీ, మొబైల్ చార్జింగ్పోర్ట్ గురించి ప్రచారం చేశాయని, టికెట్ల రేట్లను కూడా అందుకు తగ్గట్టే నిర్ణయించి చార్జ్ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవంటూ ఫోరమ్కు తెలిపాడు.
వాదనలు విన్న వినియోగదారుల హక్కుల కోర్టు.. 30 రోజుల్లో సతీష్కు రూ.5 వేలు పరిహారం కింద చెల్లించాలంటూ మహారాష్ట్ర ఆర్టీసీని ఆదేశించింది. కస్టమర్ మానసిక వేదనకు కారణం అయిన మహారాష్ట్ర ఆర్టీసీ పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.