ఎన్ కౌంటర్ : BJP MLA మాండవిని చంపిన మావోలు మృతి

లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మాండవీతో పాటు ఆయన నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏప్రిల్ 9న జరగింది.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్
ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 18)న ఉదయం పోలీసులు దంతెవాడ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా..మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతు..బీజేపీ ఎమ్మెల్యే మాండవీని మందుపాతరతో చంపిన ఇద్దరు మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో హతమయ్యారని తెలిపారు. హతమైన మావోయిస్టులను వర్గీస్, లింగాగా పోలీసులు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో మిలిషీయా సభ్యుడు ఒకరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Chhattisgarh: 2 naxals, including an ACM Vargese – involved in the attack where BJP MLA Bhima Mandavi & 5 police personnel were killed,
were killed in an encounter with District Reserve Guard (DRG) in forest area of Dhanikarka under Kuakonda police station limits earlier today. pic.twitter.com/ktkNe56ook— ANI (@ANI) April 18, 2019