మిజో స్టూడెంట్స్ ప్రతిజ్ఞ : బయటి వాళ్లను పెళ్లి చేసుకోం

మిజోరం రాష్ట్రంలో గిరిజన జనాభా అధికమనే విషయం తెలిసిందే. అయితే అక్కడి గిరినులు తమ ఉనికిపై బయటివారి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మిజో గిరిజన తెగకు చెందినవారు బయటి వ్యక్తులను(గిరిజనేతరులను)వివాహం చేసుకోవద్దనే ప్రచారాన్ని విస్తృతం చేశాయి. మిజోరంలో అత్యంత ప్రాబల్యం ఉన్న విద్యార్థి సంఘం మిజో జిర్లాయి పాల్(ఎంజెడ్పీ) ఇందుకోసం నడుం బిగించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు పాఠశాలలోని విద్యార్థులతో సోమవారం ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు.
బయటి వ్యక్తుల ప్రభావం నుంచి తమ గిరిజన సంస్కృతిని రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంజెడ్పీ సభ్యులు తెలిపారు. ఎంజెడ్పీ నాయకులు సోమవారం రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో పర్యటించారు. ఎంజెడ్పీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. బయటి వ్యక్తులను వివాహం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించామే కానీ వారితో ఎటువంటి లిఖిత పూర్వక పత్రాలు రాయించుకోలేదని, ఎవరిని బలవంతం చేయడం లేదని ఆయన తెలిపారు. కేవలం విద్యార్థులకు సూచన మాత్రమే చేస్తున్నామని తెలిపారు.
2015 నుంచి ప్రతి సెప్టెంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తమది చాలా చిన్న సంఘం అని, బయటివారితో తాము సులువుగా కలిసిపోలేమని, ఒకవేళ ఇక్కడివారు బయటివారిని పెళ్లి చేసుకుంటే తమ సంఖ్య మరింతగా తగ్గుంతుందన్నారు. మిజో మహిళలు గిరిజనేతరులను పెళ్లి చేసుకుంటే వారు తాము అనుభవిస్తున్న ఎస్టీ హోదాను కోల్పోయేలా చట్టం తీసుకురావాలని యంగ్ మిజో అసోసియేషన్ డిమాండ్ చేసింది