PM Modi: కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన చిన్నారులకు రూ.4000
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకాలను విడుదల చేశారు. ఇందులో కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లను బదిలీ చేశారు.
PM Modi: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకాలను విడుదల చేశారు. ఇందులో కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లను బదిలీ చేశారు.
పిల్లల కోసం పీఎం కేర్స్కు సంబంధించిన పాస్బుక్, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్ను అందజేశారు.
మార్చి 11, 2020 నుండి ఈ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను లేదా చట్టపరమైన సంరక్షకులను లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడానికి, PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ను మే 29, 2021న ప్రారంభించారు.
Read Also: రేపే పీఎం కేర్స్ స్కాలర్షిప్ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
“కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తుల పరిస్థితి ఎంత కష్టమో నాకు తెలుసు. మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అటువంటి పిల్లల కోసం చేసిన ప్రయత్నమే’’ అని వీడియో కాన్ఫరెన్స్లో మోదీ అన్నారు.
ఎవరైనా వృత్తిపరమైన కోర్సులు, ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే పీఎం-కేర్స్ సహాయం చేస్తుందని మోదీ అన్నారు. రోజువారీ అవసరాల కోసం ఇతర పథకాల ద్వారా వారికి ప్రతి నెల రూ.4,000 కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.