2020లో భారత్ వృద్ధిని 0.2శాతానికి తగ్గించిన మూడీస్

  • Published By: venkaiahnaidu ,Published On : April 28, 2020 / 03:59 PM IST
2020లో భారత్ వృద్ధిని 0.2శాతానికి తగ్గించిన మూడీస్

Updated On : April 28, 2020 / 3:59 PM IST

కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ ఏడాదికి గాను భారీగా తగ్గించింది. 2020కి భారత వృద్ధిని 0.2కి తగ్గించింది మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్.

మార్చి నెలలో అంచనావేసిన 2.5 శాతం వృద్ధిని ఇప్పుడు 0.2కి తగ్గించింది మూడీస్. అయితే 2021కి భారత వృద్థి 602శాతంతో పుంజుకుంటుందని మూడీస్ అంచనా వేసింది. గ్లోబల్ మాక్రో అవుట్ లుక్ 2020-21 (ఏప్రిల్ 2020 అప్‌డేట్) అనే టైటితో విడుదల చేసిన రిపోర్ట్ లో…ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూసివేసిన నేపథ్యంలో కరోనావైరస్ సంక్షోభం యొక్క ఆర్థిక ఖర్చులు వేగంగా పేరుకుపోతున్నాయని మూడీస్ తెలిపింది.

2020 లో ఒక సమూహంగా జి -20 అధునాతన ఆర్థిక వ్యవస్థలు 5.8 శాతం కుదించవచ్చని ఇది అంచనావేసింది. క్రమంగా కోలుకున్నప్పటికీ, చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో 2021 రియల్ GDP… ప్రీ-కరోనావైరస్ స్థాయిల కంటే తక్కువగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ 2020 లో 1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

మరోవైపు భారతదేశం 21 రోజుల నుండి దేశవ్యాప్త లాక్ డౌన్ ను 40 రోజులకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ ఏప్రిల్ రెండవ భాగంలో వైరస్ లేని చాలా ప్రాంతాల్లో వ్యవసాయ పెంపకాన్ని(agricultural harvesting)సులభతరం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది. అయితే కరోనా వైరస్ గుర్తించడం,కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్న సమయంలో వివిధ రీజియన్లు తెరిచేందుకు కూడా భారతదేశం దశలవారీగా ప్రణాళికలు సిద్ధం చేసిందని మూడీస్ తెలిపింది.