మోడీ పచ్చి అబద్దాలకోరు: కేంద్రంలో చక్రం తిప్పేది మేమే
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పచ్చి అబద్దాలకోరు అంటూ మమత విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పచ్చి అబద్దాలకోరు అంటూ మమత విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పచ్చి అబద్దాలకోరు అంటూ మమత విమర్శించారు. పశ్చిమ బెంగాల్, అలిపురద్వార్ జిల్లాలోని బరోబిషా ప్రాంతంలో పబ్లిక్ ర్యాలీలో మమతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తృణమూల్ పార్టీనే కీలకంగా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. మోడీపై మమత వ్యక్తిగత విమర్శల దాడి చేశారు. తన సొంత వాళ్ల బాగోగులనే సరిగా చూడని వ్యక్తి .. దేశ పౌరులను ఎలా చూస్తాడని విమర్శించారు.
Read Also : వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?
చట్టపరంగా దేశపౌరులైన వారిని విదేశీయులుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. NRC, సిటిజన్ సవరణ బిల్లుల పేరుతో దేశపౌరులను దూరం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. దేశ ప్రజలను రక్షించుకునేందుకు బీజేపీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టీఎంసీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్దాలకోరు. గత ఐదేళ్లుగా అబద్దాలు చెబుతూనే ఉన్నాడు. 2014లో ఇచ్చిన హామీల్లో ఒక హామీని కూడా నెరవేర్చలేకపోయాడు’ అని మమతా విమర్శలు గుప్పించింది.
Read Also : ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి