అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇకపై నెలవారీ, వార్షిక పాస్‌ సమాచారం.. అంతేకాదు.. రూ.3,000కే..

ఈ వివరాలు రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్‌ యాప్‌, సంబంధిత ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయి.

అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇకపై నెలవారీ, వార్షిక పాస్‌ సమాచారం.. అంతేకాదు.. రూ.3,000కే..

Updated On : October 25, 2025 / 6:07 PM IST

NHAI: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తన పరిధిలోని అన్ని టోల్‌ప్లాజాల్లో స్థానిక నెలవారీ పాస్‌, వార్షిక పాస్‌ సౌకర్యాలపై సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాలంటూ ఫీల్డ్‌ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

పారదర్శకతను పెంచడం, జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వారికి రాయితీ పాస్‌ రేట్లు, అర్హతలు, ప్రక్రియలపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ చర్యలు తీసుకుంటోంది. (NHAI)

ఎన్‌హెచ్‌ఏఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పాస్‌ల వివరాలు టోల్‌ప్లాజా ఎంట్రీ, ఎగ్జిట్‌, కస్టమర్‌ సర్వీస్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బోర్డులపై ఈ సమాచారాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమాచారం ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

Also Read: కిమ్‌ కర్దాషియన్‌కు ఈ భయంకర ‘మెదడు సమస్య’ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం మనలోని చాలా మందికి ఇలాగే..

ఫీల్డ్‌ కార్యాలయాలు 30 రోజుల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేసి, అవి పగలు, రాత్రి సమయాల్లో స్పష్టంగా కనిపించేలా చూసేలా ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది.ఈ వివరాలు రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్‌ యాప్‌, సంబంధిత ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయి.

స్థానిక నెలవారీ పాస్‌ సౌకర్యం కింద, టోల్‌ప్లాజా పరిధిలో 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వ్యక్తులు తమ వ్యక్తిగత వాహనాల్లో రాయితీతో ప్రయాణించే అవకాశం పొందుతారు. దరఖాస్తుదారు ఆధార్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, నివాస రుజువు పత్రం టోల్‌ప్లాజా హెల్ప్‌డెస్క్‌ వద్ద సమర్పించాలి. ధ్రువీకరణ అనంతరం పాస్‌ జారీ చేస్తారు.

కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వ్యక్తిగత వాహనాలకు వార్షిక పాస్‌ వర్తిస్తుంది. ఒకసారి రూ.3,000 చెల్లిస్తే ఒక సంవత్సరం లేదా 200 ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ పాస్‌ రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా సుమారు 1,150 టోల్‌ప్లాజాల్లో చెల్లుబాటు అవుతోంది.