No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…

నవంబరు 25వతేదీ శనివారం నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదికారికంగా ప్రకటించింది. సాధు వాస్వానీ పుట్టినరోజు నవంబర్ 25 సందర్భంగా శనివారం మాంసరహిత దినోత్సవంగా ప్రకటించామని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు తెలిపింది.....

No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…

Yogi No non veg day

No non veg day : నవంబరు 25వతేదీ శనివారం (నేడు) నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదికారికంగా ప్రకటించింది. సాధు వాస్వానీ పుట్టినరోజు నవంబర్ 25 సందర్భంగా శనివారం మాంసరహిత దినోత్సవంగా ప్రకటించామని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు తెలిపింది.

ALSO READ : Telangana Polls: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్

సాధువస్వానీ భారతీయ విద్యావేత్త. ఈయన పాకిస్థాన్ దేశంలోని సింధ్ లో సెయింట్ మీరా స్కూలును స్థాపించారు. సాధువస్వానీ బోధనలకు సంబంధించిన మ్యూజియం, దర్శన్ మ్యూజియం పూణేలో ప్రారంభించారు. హలాల్ సర్టిఫికేషన్‌తో ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ,విక్రయాలపై యోగీ సర్కారు ఇటీవల నిషేధం విధించింది. దీని తర్వాత ఎగుమతి కోసం తయారు చేసిన మాంస ఉత్పత్తులను మినహాయిస్తూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ : Caste Census : ఏపీలో కులగణనకు ముహూర్తం ఫిక్స్, ఎప్పటి నుంచి అంటే

హలాల్-సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం అనంతరం ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆహార పదార్థాలను పరిశీలించడానికి పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. నవంబర్ 22వతేదీన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌పై ఎఫ్‌ఎస్‌డిఎ బృందం దాడి చేసింది.మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ లో హలాల్-ధృవీకృత ఉత్పత్తులను, ప్రత్యేకంగా ప్యాక్ చేసిన మూటలను అధికారులు కనుగొన్నారు. లక్నోలోని సహారా మాల్‌లో కూడా దాడులు నిర్వహించారు. అక్కడ 8 కంపెనీలు హలాల్-సర్టిఫైడ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.