2024 Electins: మోదీ, రాహుల్.. ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారన్న సర్వేలో ఆశ్చర్యకరమైన తీర్పిచ్చిన ప్రజలు

ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు.

2024 Electins: మోదీ, రాహుల్.. ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారన్న సర్వేలో ఆశ్చర్యకరమైన తీర్పిచ్చిన ప్రజలు

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ ఎన్నికలకు ముందు ప్రజలను ప్రలోభపెట్టేందుకు వ్యూహరచన చేసేందుకు బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీ ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ప్రజలు ప్రత్యక్ష ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సి వస్తే, వారు ఎవరిని ఎన్నుకుంటారు? అని ఆ సర్వేలో ప్రశ్నించింది.

కాగా, ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు. ఈ ఇద్దరూ వద్దని 4 శాతం మంది స్పష్టం చేయగా, తెలియదని 5 శాతం మంది చెప్పారు.

మీరు ప్రత్యక్ష ప్రధానమంత్రిని ఎంచుకోవలసి వస్తే, మీరు ఎవరిని ఎంచుకుంటారు?
నరేంద్ర మోదీ – 59 శాతం
రాహుల్ గాంధీ- 32 శాతం
రెండూ కాదు – 4 శాతం
తెలియదు – 5 శాతం

10 రాష్ట్రాల పూర్తి డేటా

రాష్ట్రం                  మోదీ          రాహుల్      ఇద్దరూ కాదు  తెలియదు
ఛత్తీస్‌గఢ్            67%               29%              1%               3%
కర్ణాటక               65%              26%             2%                7%
మధ్యప్రదేశ్          66%             28%              3%                3%
రాజస్థాన్             65%             32%             2%                1%
తెలంగాణ            50%             40%              2%               8%
బీహార్                 66%             26%             6%               2%
మహారాష్ట్ర            55%            30%             6%               9%
పంజాబ్               35%            36%           14%              15%
పశ్చిమ బెంగాల్   60%            35%             2%               3%
ఉత్తరప్రదేశ్           60%           30%             8%               2%