Peoples Vaccine Alliance: సెకన్‌కు రూ.75వేల సంపాదన

కరోనాను అడ్డం పెట్టుకుని వ్యాక్సిన్‌ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించాయి.

Peoples Vaccine Alliance: సెకన్‌కు రూ.75వేల సంపాదన

Vaccine

Updated On : November 17, 2021 / 1:41 PM IST

Big Pharma: కరోనాను అడ్డం పెట్టుకుని వ్యాక్సిన్‌ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించాయి. ఫైజర్‌, ఎన్ బయోటెక్‌, మోడర్నా కంపెనీలు కోవిడ్‌ వ్యాక్సిన్ల కారణంగా ప్రతి నిముషానికి ఉమ్మడిగా 65వేల డాలర్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచంలోని నిరుపేద దేశాలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్‌లో తేలింది.

ఈ కంపెనీలు పెద్ద మొత్తంలో టీకా డోసులను సంపన్న దేశాలకే విక్రయించాయి. దాంతో తక్కువ ఆదాయం గల దేశాలు టీకాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయెన్స్‌ వెల్లడించింది. కోవిడ్‌ వ్యాక్సిన్లు విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు అందాలని ప్రచారం చేసే ఈ సంస్థ స్వయంగా విశ్లేషించి, రూపొందించిన రిపోర్ట్ ఆధారంగా గణాంకాలు రూపొందించింది.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపట్నుంచే ప్రారంభం

2021లో ఈ మూడు కంపెనీలు ముందస్తు పన్ను లాభాలు ఆర్జించనున్నాయని అలయన్స్‌ అంచనా వేసింది. సెకనుకు 75వేలకు పైగా, నిముషానికి 48లక్షల 40వేలకు పైగా, రోజుకు 9.35కోట్లను ఆర్జిస్తున్నాయని పేర్కొంది.

కేవలం కొద్ది కంపెనీలు ప్రతి గంటకూ ఇంత సంపాదన వస్తుంటే, మరోపక్క నిరుపేద దేశాల్లో కేవలం 2శాతం మంది జనాభా మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారని పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయెన్స్‌ ఆఫ్రికా చెబుతోంది. ఆస్ట్రాజెనికా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీల చర్యలకు విరుద్ధంగా ఈ మూడు కంపెనీల చర్యలు ఉన్నాయని తెలిపింది.