Pamban Bridge: దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

Pamban Bridge: దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

New Pamban Bridge

Updated On : April 6, 2025 / 2:04 PM IST

Pamban Bridge: తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలోనే రామేశ్వరం – తాంబరం ప్రత్యేక రైలును మోదీ ప్రారంభించారు. ఇది కొత్త బ్రిడ్జి మీదుగా పరుగులు తీసింది. రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సందడి చేశారు. అదేవిధంగా వంతెన కిందుగా ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకూ మోదీ పచ్చ జెండా ఊపారు.

 

 

న్యూ పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలు..
♦ న్యూ పంబన్ బ్రిడ్జి భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
♦ మన దేశపు తొలి వర్టికల్‌ బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి మొదలుకుని బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానిస్తుంది.
♦ న్యూ పంబన్ వంతెనను రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవరత్న పీఎస్‌యూ రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) నిర్మించింది.
♦ 2020లో పనులు ప్రారంభించింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
♦ ఈ బ్రిడ్జిపై 600 మీటర్ల పరిధిలో భారీ పరిమాణంలో వర్టికల్‌ లిఫ్ట్‌ ఉంది. దీని పనులు పూర్తికావడానికే దాదాపు ఐదు నెలలు పట్టింది.
♦ వర్టికల్ లిఫ్ట్ బరువు 660 టన్నులు. పొడువు 72.5 మీటర్లు. ఈ పంబన్ బ్రిడ్జి మొత్తం పొడవు 2.07 కిలోమీటర్లు. బ్రిడ్జి కింద నుంచి ఓడలు ఎటువంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించొచ్చు.
♦ బ్రిడ్జికి ఇరు వైపులా ఉండే భారీ స్తంభాలకు 320 టన్నుల బరువు ఉన్న దూలాలు (బరువు 625 టన్నులు) వేలాడుతూ ఉంటాయి.

 

 

♦ న్యూ పంబన్ వంతెన ద్వారా ఈ ప్రాంతపు సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కాపాడుకోవడమేగాక, ఇక్కడ డిజైన్, కనెక్టివిటీ, ప్రాంతీయ అభివృద్ధిలో సాధించిన అభివృద్ధిని సూచిస్తోంది.
♦ సుమారు 104 సంవత్సరాల కిందట నిర్మించిన పాత పాంబన్‌ బ్రిడ్జి ఇనుముకు తుప్పు పట్టింది. అందుకే న్యూ బ్రిడ్జికి తుప్పు పట్టకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్‌ పెయింట్‌ వేసినట్లు అధికారులు తెలిపారు.
♦ మరో 58ఏళ్ల వరకు తుప్పు పట్టదు. అలాగే, రిపైర్లు చేయిస్తే దాదాపు వందేళ్ల వరకు తుప్పు సమస్య ఉండదు.
♦ 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్‌ను 17 మీటర్ల వరకు ఎత్తవచ్చు. దీని వల్ల పెద్ద నౌకలు కింద నుంచి వెళ్లే వీలు ఉంటుంది.
♦ పాత వంతెన కంటే కొత్త వంతెన మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది
♦ ఈ సబ్‌స్ట్రక్చర్‌ను రెండు ట్రాక్‌ల కోసం రూపొందించారు. సూపర్‌స్ట్రక్చర్ ప్రారంభంలో ఒకే లైన్‌కు అనుగుణంగా ఉంటుంది
♦ ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించడం వల్ల వంతెన దాదాపు 100 ఏళ్ల వరకు ఉంటుంది
♦ ఈ వంతెనను స్టెయిన్‌లెస్ స్టీల్ రీన్‌ఫోర్స్‌మెంట్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్‌లతో నిర్మించారు.