PMAYG: పీఎంఏవై జి స్కీం లబ్ధిదారులకు ప్రధాని మోదీ శుభవార్త

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద ఒక లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం మొదటి విడత నిధులను విడుదల చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.....

PMAYG: పీఎంఏవై జి స్కీం లబ్ధిదారులకు ప్రధాని మోదీ శుభవార్త

PMAY-G Scheme

Prime Minister Narendra Modi : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద ఒక లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం మొదటి విడత నిధులను విడుదల చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ALSO READ : దైవ దర్శనం చేసుకుని వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

పీఎంఏవై పథకం మొదటి విడత నిధులను జనవరి 15 వతేదీన మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా పీఎంఏవై లబ్ధిదారులతో కూడా ప్రధాన మంత్రి సంభాషిస్తారు. రూ. 24,000 కోట్ల బడ్జెట్‌తో 9 మంత్రిత్వ శాఖల ద్వారా పలు పథకాలను అమలు చేస్తున్నారు. సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, విద్యుత్, రహదారి, టెలికాం కనెక్టివిటీ లాంటి సౌకర్యాలతో గృహాలు నిర్మించనున్నారు.