పోలింగ్ డే : జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 15 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 221 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓటర్లున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కానీ..భద్రతా కారణాల మధ్య..జమువా, బోడర్, తుండి, దుమ్రి, గిరిధ్ స్థానాల్లో సాయంత్రం 3గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
* మొత్తం 81 సీట్లున్నాయి.
* మొదటి మూడు విడతల్లో 50 స్థానాలకు పోలింగ్ ముగిసింది.
* నాలుగో విడత ఎన్నికల్లో 15 సీట్లకు ఎన్నికలు పూర్తవుతాయి.
* డిసెంబర్ 20న చివరి దశ పోలింగ్ (16 సీట్లకు) జరుగనుంది.
* ఫలితాలు డిసెంబర్ 23న.
– బరిలో ఉన్న ప్రముఖులు
* జార్ఖండ్ కార్మిక శాఖ మంత్రి రాజ్ పాలివార్, రెవెన్యూ శాఖ మంత్రి అమర్ కుమార్ బౌరి
* మధుపర్ స్థానం నుంచి పాలివార్ జేఎంఎం అభ్యర్థి హుస్సేన్ అన్సారీ
* అమర్ కుమార్ బౌరి ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఏజేఎస్యూ ఉమాకాంత్ రజాక్
* జరియా నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ సతీమణి రజిని సింగ్ పోటీ
* జరియా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి దివంగత నీరజ్ సింగ్ సతీమణి పూర్ణిమ
* నీరజ్ సింగ్ హత్య కేసులో ఆరోపణలతో ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
Read More : డెడ్ లైన్ : ఆధార్ – పాన్ లింక్ తప్పనిసరి