Priyanka Gandhi: వయనాడ్లో గెలుపుపై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
తన సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడని చెప్పారు. తనకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటున్నందుకు ధన్యవాదాలని అన్నారు.

Priyanka Gandhi
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ 4 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు.
“వయనాడ్లోని సోదరులు, సోదరీమణులు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞత చెబుతున్నాను. ఈ గెలుపు మీ గెలుపే. మీకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు ఎన్నుకున్న నేను మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను.. మీ కోసం పోరాడతారు. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు, మీరు నాపై చూపిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు” అని అన్నారు. యూడీఎఫ్ కూటమిలోని వారు, కార్మికులు, వాలంటీర్లు ఈ ప్రచారంలో చాలా కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, రైహాన్, మిరాయా ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదని పేర్కొన్నారు.
తన సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడని చెప్పారు. తనకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ప్రియాంకా గాంధీకి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు బస్సుయాత్రపై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం..