కేంద్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్

మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం(సెప్టెంబర్-1,2020) కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గతనెలలో రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి రాజీవ్ కుమార్ పని చేయనున్నారు.
ఈ సందర్బంగా రాజీవ్ కుమార్కు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీహార్-ఝార్ఖండ్ క్యాడర్ 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ 36 ఏళ్ల సర్వీసులో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు.
గత నెల 31వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. దీంతో ఆయన మంగళవారం ఎన్నికల కమిషనర్ గా బాద్యతలు చేట్టారు.