Sabarimala : శబరిమల టెంపుల్‌కు పోటెత్తిన భక్తులు.. ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారంటే?

Sabarimala : శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో

Sabarimala : శబరిమల టెంపుల్‌కు పోటెత్తిన భక్తులు.. ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారంటే?

Sabarimala Temple

Updated On : December 15, 2025 / 11:43 AM IST

Sabarimala : శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

Also Read : Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అలా చేయకుంటే రేషన్ కట్..! హెచ్చరికలు జారీ..

శబరిమలలో నవంబర్ 16న మండల పూజా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 27వ తేదీతో ముగియనున్నాయి. అయితే, శబరిమల అయ్యప్ప స్వామిని ఈ సీజన్లో ఇప్పటి వరకు 25లక్షల మందికిపైగా దర్శించుకున్నారు. ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ వివరాలు వెల్లడించారు.

గతేడాదితో పోలిస్తే ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందట. 2024 సంవత్సరంలో మొత్తం 21లక్షల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 25లక్షల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు శ్రీజిత్ తెలిపారు. ఈనెల చివరి వరకు భక్తులు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.