Kerala : క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి…కేరళలో వంతెన కూలి పలువురికి గాయాలు

క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పలువురు గాయపడినట్లు కేరళ పోలీసులు చెప్పారు....

Kerala : క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి…కేరళలో వంతెన కూలి పలువురికి గాయాలు

bridge collapses

Updated On : December 26, 2023 / 6:45 AM IST

Kerala : క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పలువురు గాయపడినట్లు కేరళ పోలీసులు చెప్పారు. నెయ్యట్టింకర సమీపంలోని పూవార్ వద్ద క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన సోమవారం రాత్రి కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు.

ALSO READ : Romanian flight : ఫ్రాన్స్ విమానం ముంబయిలో ల్యాండింగ్

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారని, ఓ మహిళకు కాలు విరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జలపాతం, జీసస్ జననాన్ని వర్ణించే జనన దృశ్యంతో పాటు ఇతర అలంకరణలను చూసేందుకు ప్రజలు గోడపై నుంచి అవతలి వైపుకు వెళ్లేందుకు తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు.

ALSO READ : Today Headlines: నేడు ప్రధాని మోదీతో రేవంత్, భట్టి విక్రమార్క భేటీ.. 28న హైదరాబాద్ కు అమిత్ షా

కూలిన వంతెన భూమి నుంచి కేవలం ఐదు అడుగుల ఎత్తులో ఉంది. ఒకేసారి ఎక్కువ మంది వంతెనపైకి ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.