శబరిమలలో శ్రీలంక మహిళ : నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు
అయ్యప్ప ఆలయంలో శ్రీలంక మహిళ హల్ చల్ చేసింది. ఇప్పటికే అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ గొడవ సద్దుమణగకముందే ఇప్పుడు మరో కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ జనవరి 3 తేదీ రాత్రి 9.30 గంటలకు అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చింది.
![శబరిమలలో శ్రీలంక మహిళ : నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు శబరిమలలో శ్రీలంక మహిళ : నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు](https://10tv.in/wp-content/uploads/2019/01/Sabharimala-in-Srilanka-women.jpg)
అయ్యప్ప ఆలయంలో శ్రీలంక మహిళ హల్ చల్ చేసింది. ఇప్పటికే అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ గొడవ సద్దుమణగకముందే ఇప్పుడు మరో కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ జనవరి 3 తేదీ రాత్రి 9.30 గంటలకు అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చింది.
శబరిమల : అయ్యప్ప ఆలయంలో శ్రీలంక మహిళ హల్ చల్ చేసింది. ఇప్పటికే అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ గొడవ సద్దుమణగకముందే ఇప్పుడు మరో కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ జనవరి 3 తేదీ రాత్రి 9.30 గంటలకు అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చింది. దీంతో అక్కడ వున్న భక్తులు ఆమెను అడ్డుకున్నారు.
దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు 46 ఏళ్లు దాటాయని..తనకు మెనోపాజ్ దశ కూడా దాటిందని దానికి తన వయస్సుకు సంబంధించిన సర్టిఫికెట్స్ ను చూపించినా ఆమెను ఆలయంలోకి వెళ్లేందుకు సదరు భక్తులు ఒప్పుకోలేదు. దీనిపై ఆగ్రహించిన ఆమె తనను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదనీ..తానో భక్తురాలినని, , 1972లో జన్మించాననీ..48 రోజుల దీక్షలో ఉన్నానని పేర్కొన్నారు. తనను వెనక్కి పంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వివిధ కారణాల వల్ల తన గర్భసంచిని తొలగించారని, కాబట్టి అయ్యప్పను దర్శించుకునే హక్కు తనకు ఉందని వివరించారు. అందుకు సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రం కూడా తన వద్ద ఉందని డిమాండ్ చేసారు శశికళ. అశోక్ కుమరన్ కుమార్తె శశికళగా ఆమెను గుర్తించారు.
కానీ జాతీయ పత్రిక ‘ది హిందూ’ కథనం ప్రకారం.. శశికళ పరమ పవిత్రమైన 18 మెట్లను ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేశారని ఆర్టికల్స్ రాసింది. ఈ క్రమంలో శశికళ కూడా తాను స్వామిని దర్శించుకున్నట్టు వస్తున్న వార్తలను శశికళ ఖండించారు.