Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

Supreme Court (8)

High Court Chief Justices : ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం బుధవారం సమావేశమై చర్చించారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని కొలీజియం సూచించింది.

హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో రాష్ట్రంలో ఖాళీ ఏర్పడింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచన చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో జస్టిస్ అలోక్ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.

Vande Bharat trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త

గుజరాత్‌కు మహిళా న్యాయమూర్తి సునీతా అగర్వాల్, బాంబేకి దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, మణిపూర్‌కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్రల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ పేరును బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జీ సునీతా అగర్వాల్ పేరును గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ పేరును మణిపూర్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది. గుజరాత్ హైకోర్టు జడ్జీ జస్టిస్ ఆశిష్ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయయూర్తిగా సూచించింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తలందరూ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా సరిపోతారని పేర్కొంది.

Madhyapradesh: బుల్డోజర్‌తో కూల్చేశారు.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి ఇల్లు కూల్చివేత

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే న్యాయమూర్తులు ప్రమోషన్ పొందనున్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.