అండర్ వరల్డ్ డాన్ “చోటా రాజన్” బతికే ఉన్నాడు..ఎయిమ్స్

అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ శుక్రవారం కోవిడ్ తో మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ ఎయిమ్స్

అండర్ వరల్డ్ డాన్ “చోటా రాజన్” బతికే ఉన్నాడు..ఎయిమ్స్

Underworld Don Chhota Rajan Is Still Alive

Updated On : May 7, 2021 / 7:38 PM IST

Chhota Rajan అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ శుక్రవారం కోవిడ్ తో మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అధికారులు కొట్టిపారేశారు. చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 61 ఏళ్ల చోటా రాజన్ ఏప్రిల్-26న కరోనా బారినపడటంతో ట్రీట్మెంట్ కోసం అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు అధికారులు. అప్పటినుంచే రాజన్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కాసేపటికే అందులో నిజం లేదని ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా స్పష్టం చేశారు. అతను చనిపోయాడంటూ వెలువడిన వార్తలు నిజం కాదని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయనకు కరోనా చికిత్స అందిస్తున్నామని డాక్టర్ మల్హోత్రా తెలిపారు

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడిగా భారత్‌లో అనేక నేరాలకు పాల్పడిన చోటా రాజన్ ని 2015లో ఇండోనేషియాలోని బాలిలో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2011లో ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో గతేడాది కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. రాజన్‌పై ఉన్న దాదాపు 68 కేసులను సీబీఐ విచారిస్తుండగా.. ఇందులో ఇప్పటికే 4 కేసుల్లో కోర్టులు అతన్ని దోషిగా తేల్చాయి. మరో 35 కేసుల్లో సీబీఐ అధికారుల చార్జిషీట్ దాఖలు చేశారు. వీటిపై తుది విచారణ ఇంకా జరగాల్సి ఉంది.