Video: ప్రతి ఆదివారం అక్కడి నుంచే భోజనం తెప్పించుకుంటున్న అంబానీ కుటుంబం.. అందుకే ఇలా..

Viral Video: తన కేఫ్‌ బాధ్యతలను కుమారుడికి అప్పగించే ముందు శాంతేరినే దానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారు.

Video: ప్రతి ఆదివారం అక్కడి నుంచే భోజనం తెప్పించుకుంటున్న అంబానీ కుటుంబం.. అందుకే ఇలా..

ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలకు దేశ విదేశాల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడులకు వచ్చిన వారిలో మైసూర్ కేఫ్ యజమాని నరేశ్ నాయక్ తల్లి శాంతేరి నాయక్ కూడా ఒకరు.

తన కేఫ్‌ బాధ్యతలను కుమారుడికి అప్పగించే ముందు శాంతేరినే దానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారు. పెళ్లికి వచ్చిన శాంతేరిని అనంత్ అంబానీ చూశారు. ఆ తర్వాత రాధికను పిలిచి ఆమె అక్కడకు రమ్మన్నారు. కొత్త దంపతులు ఇద్దరూ శాంతేరి నాయక్ ఆశీర్వాదం తీసుకున్నారు.

తాము ప్రతి ఆదివారం ఇంట్లో మీ భోజనమే తింటున్నామని రాధిక ఈ సందర్భంగా శాంతేరితో అన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అనంత్ అంబానీ పెళ్లికి 2500కు పైగా వంటకాలను అతిథుల కోసం సిద్ధంగా ఉంచిన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ కుటుంబానికి మైసూరు కేఫ్‌ రుచులు అంటే చాలా ఇష్టం.

దీంతో శాంతేరిని పెళ్లికి ఆహ్వానించారు. మధ్య ముంబైలోని మతుంగాలో మైసూర్‌ కేఫ్‌ ఉంటుంది. 1936లో దీన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ముకేశ్ అంబానీ చదువుకునే రోజుల్లో ఇక్కడే తినేవారు. ప్రతి ఆదివారం అక్కడి నుంచే అంబానీ కుటుంబం భోజనం తెప్పించుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Also Read: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు షాక్ ఇచ్చిన కేంద్ర సర్కారు